smile smile smile smile smile smile smile smile smile smile smile

పవన్ రెమ్యూన‌రేష‌న్ వింటే షాక్!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా.. మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తాడా అని వేచి చూస్తున్న అభిమానులకు ఒకేసారి అర డజన్ సినిమాలు చేస్తూ స్వీట్ షాక్ ఇచ్చాడు పవర్ స్టార్. నిర్మాతలు కూడా ప‌వ‌న్ డేట్స్ కోసం లైన్‌లో ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తైపోయింది. ఈ సినిమా ఎప్రిల్ 9న విడుదల కానుంది. మరోవైపు క్రిష్ హరిహర వీరమల్లు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు పవర్ స్టార్.

దిల్ రాజు, ఏఎం రత్నంతో పాటు రామ్ తళ్లూరి, మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు కూడా పవన్ డేట్స్ తీసుకున్నారు. కొందరు నిర్మాతలైతే మీకు వీలైనప్పుడు డేట్స్ ఇవ్వండి.. సినిమా పూర్తి చేస్తామంటున్నారు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే పవన్ కూడా పారితోషికం విషయంలో కొండెక్కి కూర్చున్నాడు. ఇక హరీష్ శంకర్ సినిమా కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాతో పాటు మరో 4 సినిమాలు కూడా లైన్‌లో పెట్టేసాడు పవర్ స్టార్. ఈ సినిమాల కోసం రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు పవన్.

వకీల్ సాబ్ కోసం 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే కోట్ల రూపంలో కాదు.. షేర్ రూపంలో ఇది పవన్ ఖాతాలోకి వెళ్తుందని తెలుస్తుంది. పవన్ రీ ఎంట్రీ సినిమా అంటే కచ్చితంగా బిజినెస్ 130 కోట్లకు పైగానే జరుగుతుంది. అజ్ఞాతవాసితోనే పవన్ అప్పట్లో రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా తొలిరోజే 40 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అలాంటి ఇమేజ్ ఉన్న పవన్‌కు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.

రీ ఎంట్రీ సినిమా కోసం నిజంగా 50 కోట్లు తీసుకుంటే మాత్రం అది కూడా ఓ రికార్డే. ఏదేమైనా పవన్ ఇమేజ్ అలా ఉంది మరి ఏం చేస్తాం. క్రిష్ సినిమాకు కూడా 50 కోట్లకు పైగానే ఇస్తున్నాడు ఏఎం రత్నం. హరీష్ శంకర్ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ నాలుగేళ్ల కిందే 13 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిందనే వార్తలున్నాయి. ఈ సినిమాకు మొత్తంగా 40 కోట్లతో పాటు రైట్స్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. వాటితో పాటు మలయాళ రీమేక్ అయ్యప్పుమ్ కోషియున్ సినిమా కూడా ఒప్పుకున్నాడు పవన్. ఈ చిత్రం కోసం కేవలం 35 నుంచి 40 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చాడు పవన్. దీనికోసం 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను సాగర్ కే చందర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో పవన్, రానా కలిసి నటిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది కూడా.

వీటన్నింటితో పాటు సురేందర్ రెడ్డి సినిమా బ్యాలెన్స్ ఉంది. ఏదేమైనా కూడా ప్రతీ సినిమాకు కనీసం 50 కోట్లు అయితే కచ్చితంగా తీసుకుంటున్నాడు పవర్ స్టార్. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్న ఓ కొరియన్ రీమేక్‌లో పవన్, రవితేజ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. చూడాలి మ‌రి ప‌వ‌ర్ స్టార్ ఏ రేంజ్‌లో బాక్సాపీసును దుమ్ముదుల‌ప‌నున్నాడో.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *