smile smile smile smile smile smile smile smile smile smile smile

విద్యాబాలన్ ను మెచ్చుకున్న కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నటీమణి కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా మెచ్చుకోదు. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా పొగుడుతూ ఉంటుంది.
తాజాగా ఓ ఘటన జరిగింది. దర్శకుడు మిలన్ లూధ్రియా ‘ది డర్టీ పిక్చర్’ను మొదట కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అందుకు అంగీకరించక పోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్ ను వరించింది. ఆ సినిమాతో విద్యా బాలన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది. ‘ది డర్టీ పిక్చర్’ కంటే ముందు మిలన్.. కంగనాతో ‘వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై’ మూవీ చేశాడు. దాంతో ‘ది డర్టీ పిక్చర్’ ఆఫర్ కూడా కంగనాకు ఇచ్చాడు. కానీ ఆ సమయంలో ఆ సినిమా శక్తిని గుర్తించడంలో తాను విఫలం అయ్యానని కానీ.. ఇప్పుడేం అందుకు బాధపడటం లేదని కంగనా తెలిపింది. విద్యాబాలన్ అందులో సిల్క్ స్మిత పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా అలా చేయడం వంటివి తనకు రాదని కూడా కంగనా ఒప్పేసుకుంది. అయితే ఆ సమయంలో సిల్క్ స్మిత బయోపిక్ ను తిరస్కరించిన కంగనా రనౌత్ ఇప్పుడు మాత్రం దక్షిణాది నాయిక, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *