smile smile smile smile smile smile smile smile smile smile smile

గోపిచంద్ మరోసారి అదే ప్రయోగం…

యాక్షన్ హీరో గోపిచంద్ మరోసారి తన ద్విపాత్రాభినయం అనే ప్రయోగంతో అలరించనున్నారు. తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు గోపిచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం అనే ప్రయోగాన్ని సాహసంతో చేయబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ లో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో మెరవపబోతున్నట్లు తెలుస్తోంది. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి ముప్పై ఏళ్ల తర్వాత శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. నిజానికి గోపీచంద్ కి నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజనే. ‘జయం’ సినిమాతో గోపిచంద్ కి హిట్ ఇచ్చిన తేజ ఆ తర్వాత తనతో ‘నిజం’లో కూడా విలన్ పాత్ర పోషింప చేశాడు.
అంతేకాకుండా ఆ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కలయిలో ఓ సినిమా ఈ విధంగా రానుండటం విశేషం. ఇప్పుడు తేజ, గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు టాక్. మరి రెండో సారి ద్విపాత్రాభినయం చేయబోతున్న గోపీచంద్ ఈ సారైనా ఈ ప్రయోగంతో హిట్ ఏ విధంగా కొడతాడో మరి వేచి చూడాలి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *