smile smile smile smile smile smile smile smile smile smile smile

చావు కబురు చల్లగాతో కార్తికేయకు సరికొత్త రికార్డ్…

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.
అయితే కార్తికేయ కెరీర్ లో మరో భారీ ప్లాప్ గా ఈ సినిమా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’లో విడుదలైంది ‘చావు కబురు చల్లగా’. అయితే సినిమా విడుదలకు ముందు ఓటిటి ప్రేక్షకుల కోసం కొంచం రీఎడిట్ చేశారట మేకర్స్. ఇక ఆహాలో ఈ చిత్రం విడుదలైన 72 గంటల్లోనే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఓటిటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్ గా విలక్షణ పాత్ర పోషించారు. మురళీ శర్మ, రావు రమేష్, ఆమని ముఖ్యపాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *