చావు కబురు చల్లగాతో కార్తికేయకు సరికొత్త రికార్డ్…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.
అయితే కార్తికేయ కెరీర్ లో మరో భారీ ప్లాప్ గా ఈ సినిమా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’లో విడుదలైంది ‘చావు కబురు చల్లగా’. అయితే సినిమా విడుదలకు ముందు ఓటిటి ప్రేక్షకుల కోసం కొంచం రీఎడిట్ చేశారట మేకర్స్. ఇక ఆహాలో ఈ చిత్రం విడుదలైన 72 గంటల్లోనే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఓటిటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్ గా విలక్షణ పాత్ర పోషించారు. మురళీ శర్మ, రావు రమేష్, ఆమని ముఖ్యపాత్రలను పోషించిన విషయం తెలిసిందే.