smile smile smile smile smile smile smile smile smile smile smile

ఇట్స్ క్లియర్… రెండు భాగాలుగా పుష్ప

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. మైత్రీ మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం కొద్దిపాటి సన్నివేశాలు తప్పితే మిగతా అంతా పూర్తయింది.

అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ‘బాహుబలి’లా ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుందంటూ వైరల్ అవుతోంది. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తామంటున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి. కాగా అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేసేందుకు సినిమా యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *