smile smile smile smile smile smile smile smile smile smile smile

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు – ఎన్ని ప్ర‌శ్న‌లకు ఎంత డ‌బ్బు ఇస్తారు? తెలుగులో రూ. 1 కోటి అందుకున్న‌దెవ‌రు?

ప్రేక్షకాదరణ పొందిన బుల్లితెర‌ షోని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో 2014 జూన్‌లో తెలుగులోకి తీసుకువచ్చారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. తెలుగు బుల్లితెర పైన సూపర్ డూపర్ హిట్టైంది. ఆ త‌ర్వాత చిరంజీవి కూడా హోస్ట్‌గా చేశారు. దాదాపు గంటన్నర సేపు ప్రసారం అయ్యేది. చాలా మంది ఎస్.ఎం.ఎస్ లు పంపించగా చివరికి 10 మంది మాత్రమే హాట్ సీటు కోసం పోటీపడుతుంటారు. ముందుగా ఈ పది మందికి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనే ప్రక్రియలో మొదట మూడు ప్రశ్నలు అడుగుతారు. అందులో ఏ వ్యక్తి తక్కువ సమయంలో వాటికి జవాబులు చెప్తారో ఆ వ్యక్తిని హాట్ సీట్ లో కూర్చోబెడతారు.

అలా హాట్ సీటుకు వచ్చిన ఆ వ్యక్తికి సంబంధించిన జీవిత విశేషాలపై ఓ వీడియోని ప్లే చేస్తారు. ఆ తర్వాత అసలు గేమ్ మొదలవుతుంది. ఈ గేమ్ లో 15 ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా హోస్ట్ అడుగుతారు.. అయితే ఈ 15 ప్రశ్నలకి గాను 3 లైఫ్ లైన్ లు ఉంటాయి. అవే.. ఆడియన్స్ పోల్, ఫోన్ ఎ ఫ్రెండ్, 50-50.. ప్రశ్నల పైన ఏ మాత్రం సందేహం ఉన్నా ఈ 3 లైఫ్ లైన్ లను వాడుకోవచ్చు.. అయితే వీటికి కేవలం 30సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఈ 15 ప్రశ్నలలో మొదటి ప్రశ్న యొక్క విలువ వెయ్యి రూపాయ‌లు. ఆ తర్వాత ప్రశ్నల విలువలు 2000, 3000, 5000, 10,000 గానూ ఒక విభాగంగా 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను 45 సెకన్లలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 5 ప్రశ్నలలో చివరి ప్రశ్న తప్పు చెప్పిన ఏ విధమైన ప్రైజ్ రాదు. ఇక 6 నుంచి 10 ప్రశ్నల యొక్క విలువలు క్రమంగా 20,000, 40,000, 80,000, 1,60.000, 3,20.000 గా ఉంటాయి. ఈ ప్రశ్నలకు 60 సెకన్లు సమయం ఉంటుంది. ఈ 5 ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోతే 10 వేలు మాత్రమే ప్రైజ్ మనీ అందుకుంటారు. ఒకవేళ ప్రశ్నకి సమాధానం తెలియక గేమ్‌ నుంచి నిష్క్రమించాలని అనుకుంటే చివరి ప్రశ్న విలువెంతో అది మాత్రమే ఆ వ్యక్తి సొంతం అవుతుంది… ఇక 11 నుంచి 15 ప్రశ్నల విలువలు క్రమంగా 6,40.000, 12,50,000, 25,00,000, 50,00,000, 1 కోటి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ప్రశ్నలకు టైం లిమిట్ అంటూ ఉండదు.. ఈ 5 ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే 3 లక్షల 20 వేలు మాత్రమే ప్రైజ్ మనీ అందుకుంటారు. లేదా ఏ ప్రశ్నకైనా సరైన సమాధానం తెలియక గేమ్ నుంచి నిష్క్రమిస్తే వారికి చివరి ప్రశ్న విలువెంతో అంత ఇస్తారు. ఇక ఈ షో మొదటి సీజన్ లో ఉమాకాంత్, అరుణ్ మెహర్ గంగరాజు అనే ఇద్దరు వ్యక్తులు 12 ల‌క్ష‌ల 50 వేల రూపాయ‌ల‌ ప్రైజ్ మనీ గెలుచుకోగా, మూడవ సీజన్ లో మొట్ట మొదటిసారి రావణ శర్మ అనే వ్యక్తి 25 లక్షలు గెలుచుకున్నారు. ఇక ఆ తరువాత జనవరి 2016 మొదటి వారంలో అమరనాధ్ – రోహిత దంపతులు 50 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా కోటి రూపాయలు గెలుచుకోలేదు. మరి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అంటూ తార‌క్ నిర్వ‌హిస్తున్న ఈ షోలో.. ఈ సారైనా ఆ కోటి శిఖరాన్ని ఎవ‌రైనా అందుకుంటారో చూడాలి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *